పోలింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని కేంద్ర సాధారణ ఎన్నికల బెల్లంపల్లి పరిశీలకులు బిశ్వజిత్ దుత్తా పేర్కొన్నారు. బుధవారం బెల్లంపల్లి పట్టణంలోని ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. అనంతరం సెక్టోరియల్, ప్రిసైడింగ్ అధికారులతో మాట్లాడారు. వారికి పోలింగ్ ప్రక్రియపై తగు సలహాలు, సూచనలు చేశారు. ఆయనతోపాటు బెల్లంపెల్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ ఉన్నారు.